25/07/2026
పాలకవర్గం మరియు అధికారులతో సమావేశం నిర్వహించిన డెయిరి చైర్మన్ శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
చైర్మన్ సమావేశంలో చర్చించిన, వెల్లడించిన అంశాలు:
గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన టర్నోవర్ ₹2,260 కోట్లు, ₹16 కోట్ల లాభం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ₹2,466 కోట్ల టర్నోవర్ లక్ష్యం
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక లెక్కలను పాలకవర్గం ఆమోదం
ప్రస్తుతం రోజుకు సగటున 8 లక్షల లీటర్ల పాల సేకరణ, సీజన్లో 10.5 లక్షల లీటర్ల వరకు సేకరణ
విక్రయిస్తున్న పాలలో 98% నేరుగా రైతుల నుంచే సేకరణ
పాల సేకరణ విస్తరణకు పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కొత్త చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు
చిత్తూరు జిల్లాలో 3 కొత్త చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు
తమిళనాడు సరిహద్దులో రోజుకు 20 వేల లీటర్ల సామర్థ్యంతో కొత్త చిల్లింగ్ సెంటర్ ఏర్పాటు
అనంతపురం జిల్లాలో 2 కొత్త పాల సేకరణ కేంద్రాలు ప్రారంభం
మౌలిక సదుపాయాలు & విస్తరణలో భాగంగా ఆధునిక ఐస్క్రీమ్ ప్లాంట్ ఏర్పాటు
₹55 కోట్లతో డీవీసీ పాల ఉప ఉత్పత్తుల తయారీ కేంద్రం పూర్తిస్థాయి ఆటోమేషన్తో విస్తరణ
మిర్యాలగూడ ప్లాంట్ సామర్థ్యాన్ని 1.5 లక్షల లీటర్ల నుంచి 3 లక్షల లీటర్లకు పెంపు
దసరా నాటికి కరీంనగర్లో సంగం డెయిరి వ్యాపార విస్తరణకు శ్రీకారం
రైతుల సంక్షేమమే లక్ష్యంగా
వెటర్నరీ సేవలను మరింత బలోపేతం
"లూస్ ఫార్మింగ్" విధానం ప్రవేశపెట్టి పశువుల ఆరోగ్యానికి ప్రోత్సాహం
ఫెన్సింగ్, దోమతెరలు, నీటి తొట్టెల నిర్మాణానికి ప్రభుత్వ సబ్సిడీలు రైతులకు అందేలా చర్యలు
వ్యవసాయం & పశుసంవర్ధక అభివృద్ధిలో భాగంగా బీపీటీ-5204, సంగం అర్జున్ వంగడాల ద్వారా రైతులకు మెరుగైన ఫలితాలు
చిత్తూరులో "సంగం రుద్ర" హైబ్రిడ్ టమోటా విత్తనాల పంపిణీ
సెక్స్డ్ సీమెన్ కార్యక్రమం ద్వారా ఉత్తమ పశు జాతుల అభివృద్ధి
డెయిరీకి జాతీయ & అంతర్జాతీయ గుర్తింపు, పనితీరును అధ్యయనం చేసేందుకు విదేశీ ప్రతినిధుల సందర్శనలు
ఎన్డీడీబీ అధికారులు సంగం డెయిరిని ఆదర్శంగా తీసుకుని ఉద్యోగులకు శిక్షణ అందిస్తున్నారు.
వరంగల్లో సంగం ఉత్పత్తులపై జరిగిన దుష్ప్రచారంపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం.
పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా విదేశీ ఎగుమతులను తాత్కాలికంగా వాయిదా
యుద్ధ పరిస్థితులు సాధారణమైన వెంటనే విదేశీ మార్కెట్లలో సంగం ఉత్పత్తుల విస్తరణకు చర్యలు చేపడతాం.