06/09/2026
*శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తాము.*
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు.................................
🔶నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు 8కోట్ల 75 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ గారు.
🔶శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఆలయ ప్రాంగణాన్ని మరింత ఆధ్యాత్మికంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు రూ.8 కోట్ల 75 లక్షలతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి
🔶రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తునం. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తాం.రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి
🔶 ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి
🔶నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఒకటి. ఈ దేవస్థానం అభివృద్ధికి రూ.8 కోట్ల 75 లక్షలు మంజూరు చేసి, నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం నియోజకవర్గ ప్రజలకు, భక్తులకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
🔶 రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గార్ల ఆశీస్సులతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆలయ పరిసరాల అభివృద్ధి, ఇతర వసతులను మెరుగుపరచడమే మా లక్ష్యం.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
🔶శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు నియోజకవర్గంలో దేవాదాయ శాఖ ద్వారా దేవాలయాలక అభివృద్ధికి మరియు సంక్షేమ కార్యక్రమాలను 13కోట్ల 45 లక్షల రూపాయలు కేటాయించాము.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
పై కార్యక్రమంలో శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, టిడిపి నాయకులు ఆనం రంగ మయూర్ రెడ్డి, గిరి నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, మలినేని వెంకయ్య నాయుడు, నగర మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీ, మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయకుమార్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ అల్లాబాక్షు, మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, క్లస్టర్ ఇంచార్జ్ జలదంకి సుధాకర్, బిజెపి జిల్లా అధ్యక్షులు శీపా రెడ్డి వంశీధర్ రెడ్డి, బిజెపి నాయకులు ఈశ్వరయ్య, జనసేన నాయకులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, కాకు మురళి రెడ్డి, అలియా, శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కమిటీ సభ్యులు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇంచార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.